
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని రైలు రాకను గమనించి పట్టాలపై తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి చేతులపై త్రిషూలం, గాయత్రి పచ్చబొట్లు ఉన్నాయి. టీషర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడు. వ్యక్తిగత ఆనవాళ్లు లభించలేదు. మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎవరైనా మృతుడి ఆనవాళ్లు తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని రైల్వే హెడ్ కానిస్టేబుల్ హన్మాండ్లు కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
లింగంపేట: మండలంలోని పొల్కంపేట శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం సాయంత్రం పట్టుకొని సీజ్ చేసినట్లు ప్రొబేషనరీ ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. ఎక్కపల్లి గ్రామానికి చెందిన నీల శంకర్, ల్యాగల గోపాల్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా పట్టున్నట్లు పేర్కొన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.