
మోడిఫైడ్ న్యూసెన్స్
మోడిఫైడ్ సైలెన్సర్లను వాడటం చట్ట విరుద్ధమని తెలిసినా వాహనదారులు వెనక్కి తగ్గడం లేదు. బండి రిజస్ట్రేషన్ పూర్తయ్యే వరకు అంతా నిబంధనల ప్రకారం ఉంటున్నా ఆ తరువాత రోడ్లపైకి వచ్చేసరికి పరిస్థితి మారుతోంది. తమకు నచ్చిన రీతిలో సౌండ్ వచ్చేలా మోడిఫైడ్ సైలెన్సర్లను వాహనాలకు ఏర్పాటు చేసుకుంటూ న్యూసెన్స్ చేస్తున్నారు. సుమారు 45 రోజుల వ్యవధిలో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు 460 మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేయడం శబ్ద కాలుష్యం తీవ్రతకు అద్దం పడుతోంది.
భారీ శబ్దాల కారణంగా కర్ణభేరికి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా శబ్దం 55 డెసిబెల్స్(డీబీ) కన్నా అధికంగా ఉంటే శబ్ద కా లుష్యం ఏర్పడుతుంది. రద్దీ ప్రాంతాల్లో 55 నుంచి 90 డెసిబెల్స్ ఉంటుంది. పరిశ్రమలు ఉండే ప్రాంతాల్లో 95 డెసిబెల్స్ కన్నా అధికంగా ఉంటుంది. శబ్ద కాలుష్యంతో మానసిక స మస్యలతోపాటు హైబీపీ, గుండెజబ్బులూ వ స్తాయి. చెవి వెనుకభాగం నరాలు దెబ్బతిన డంతో ప్రతిధ్వనులు వినిపిస్తాయి. వినికిడి శక్తి తగ్గిపోతుంది. శబ్దకాలుష్యం నివారణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఖలీల్వాడి: రయ్యుమని పక్క నుంచి దూసుకెళ్లే ద్విచక్ర వాహనాలు చేసే శబ్దానికి గుండెలు అదురుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు గ్రా మీణ ప్రాంతాల్లో యువకులు బైక్లకు అధిక శబ్దం వచ్చే మోడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలే ఇరుకుగా ఉండే నిజామాబాద్ నగర రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిన సమయంలో మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్ల గోల అంతా ఇంతా కాదు. వాయు, శబ్ద కాలుష్యంతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఖరీదైన ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా మోడిఫైడ్ సైలెన్సర్లు, హారన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. పోలీసులు జరిమానా విధిస్తున్నా యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది మార్చి 6వ తేదీన 240 సైలెన్సర్లను, ఏప్రిల్ 18వ తేదీన 220 సెలెన్సర్లను నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డు రోలర్తో తొక్కించారు. నెలన్నర వ్యవధిలోనే 460 సెలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు.
ఆర్టీఏ ఆఫీస్లో అంతా ఓకే..
ఆర్టీఏ ఆఫీసులో వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను ఉంచుతున్న వాహనదారులు ఆ తరువాత రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు వెచ్చించి మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేయించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగిస్తున్నప్పటికీ మండల స్థాయిలో స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితం ప్రశాంతంగా ఉండే పల్లెల్లో సైతం మోడిఫైడ్ సైలెన్సర్ల శబ్దానికి ప్రజలు హడలెత్తుతున్నారు.
ఈ ప్రాంతాల్లో హారన్ కొట్టొద్దన్నా..
రోడ్డు పై ప్రయాణించే సమయంలో ఎదురుగా ఏదైనా వాహనం వస్తేనే హారన్ కొట్టాలి. పాఠశాల లు, కోర్టులు, పోలీస్స్టేషన్, ప్రార్థనాలయాలు, ఆ స్పత్రులు ఉన్న ప్రాంతాల్లో హారన్ కొట్టడం పూర్తిగా నిషేధం. సరైన అవగాహన లేక ఎవరూ పాటించ టం లేదు. వేడుకలు, ర్యాలీల సమయాల్లో హారన్ లు, సైలెన్సర్ల శబ్దంతో యువత హడలెత్తిస్తున్నారు.
శబ్ద కాలుష్యంతో సమస్యలెన్నో..
45 రోజుల్లో 460 సైలెన్సర్ల తొలగింపు.. ధ్వంసం
వాహనదారులకు జరిమానా
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మారుస్తున్న వైనం
కఠినంగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్
పోలీసులు
ఆటో మొబైల్స్కు నోటీసులు ఇస్తాం
శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు అమ్మే ఆటో మొబైల్స్ కు నోటీసులు ఇస్తాం. నగ రంలోని రోడ్లపై రాత్రివేళ్లలో అధిక శబ్దం చేసే వాహనాల తో యువకులు తిరుగుతున్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేర కు ఆప రేషన్ ఛబుత్రా నిర్వహిస్తాం. రాత్రివేళల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఇబ్బందు లు కలిగించే శబ్దాలు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– ప్రసాద్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్

మోడిఫైడ్ న్యూసెన్స్

మోడిఫైడ్ న్యూసెన్స్

మోడిఫైడ్ న్యూసెన్స్