
జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు!
సిరికొండ/మోర్తాడ్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. సిరికొండ మండల కేంద్రంతోపాటు మైలారం, నర్సింగ్పల్లి , చీమన్ పల్లి, చిన్నవాల్గోట్, రావుట్ల, కుర్దుల్పేట్, హుస్సేన్నగర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్, మెండోరా మండల కేంద్రాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిపారు. భయాందోళనతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చామని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం భీమ్గల్, మెండోరా మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి అర్బన్/మాచారెడ్డి: కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి మండలం సోమారంపేటలో భూ కంపించిందని ప్రజలు తెలిపారు. భూమిలో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశామన్నారు.