
నవనాథ సిద్దులగుట్టపై ఏకశిల స్థూపం
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్దుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట చుట్టూ ప్రజలు నివాసాలను ఏర్పరుచుకున్నారు. రాతియుగంలో గుట్టకు దక్షిణాన ఉన్న ప్రజలకు కనిపించేలా ఏక శిల స్థూపాన్ని నిర్మించారు. సుమారు 15 ఫీట్ల పొడవుతో ఈ స్థూపం ఉంటుంది. స్థూపంపైన నాలుగు మూలల్లో నాలుగు పిల్లర్లు ఉండి పైనుంచి కప్పు నిర్మాణం ఉంటుంది. కింది నుంచి విసిరే రూపాయి కాయిన్ స్థూపంపైన నాలుగు పిల్లర్ల మధ్యన నిలిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం.

నవనాథ సిద్దులగుట్టపై ఏకశిల స్థూపం