జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

May 30 2025 1:54 AM | Updated on May 30 2025 1:54 AM

జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య

రెంజల్‌(బోధన్‌): మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్‌(42) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. గత శనివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన లక్ష్మణ్‌ భార్యతో ఘర్షణ పడగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన తల్లికి లక్ష్మణ్‌ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బోధన్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement