● బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్
సుభాష్నగర్: వానాకాలం సీజన్లో 14 పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలపడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ఎంఎస్పీ పెంచిందని తెలిపారు. 2014 సంవత్సరంలో వరి మద్దతు ధర రూ.1360 ఉండగా, 2025నాటికి రూ.2369కి కేంద్ర ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. రైతులకు వడ్డీ రాయితీ కోసం రూ.15,642 కోట్లు విడుదల చేసిందని, 11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచిందని, ఎంఎస్పీ కోసం రూ.2.70లక్షల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. కనీస మద్దతు ధర పెంచిన ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి జిల్లా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు.