రైస్‌మిల్లుల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

May 30 2025 1:54 AM | Updated on May 30 2025 1:54 AM

రైస్‌మిల్లుల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

రైస్‌మిల్లుల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అర్సపల్లి, ఖానాపూర్‌, సారంగాపూర్‌ ప్రాంతాల్లోని రైస్‌మిల్లులను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌తో కలిసి అర్సపల్లిలోని రుద్రా రైస్‌మిల్లు, ఖానాపూర్‌లోని ఎల్‌జీ ఆగ్రో ఇండస్ట్రీస్‌, వీరభద్ర రైస్‌మిల్లు, సారంగాపూర్‌లోని అనూ ఫుడ్స్‌ రైస్‌మిల్లును సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంటదివెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. మిల్లింగ్‌ ప్రక్రియ సైతం త్వరగా చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఎస్‌వో అరవింద్‌ రెడ్డి, సివిల్‌ సప్లైస్‌ డీఎం శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement