అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి

May 30 2025 1:54 AM | Updated on May 30 2025 1:54 AM

అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి

అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రా మానికి చెందిన గోవర్ధన్‌ (28) అనే యువకుడు గురువారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన గూల విఠల్‌ కుమారుడు గోవర్ధన్‌ నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒకాయోలో ఎంఎస్‌ చదివేందుకు వెళ్లా డు. గతేడాది నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న గోవర్ధన్‌.. బుఽ దవారం కుటుంబసభ్యులతో మాట్లాడాడు. గురువారం గోవర్ధన్‌ మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గోవర్ధన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం వచ్చేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నదని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement