ఈజిప్టుకు ఇందూరు పసుపు | - | Sakshi
Sakshi News home page

ఈజిప్టుకు ఇందూరు పసుపు

May 6 2025 12:51 AM | Updated on May 6 2025 12:51 AM

ఈజిప్టుకు ఇందూరు పసుపు

ఈజిప్టుకు ఇందూరు పసుపు

జక్రాన్‌పల్లి: పసుపును ‘ఇందూరు పసుపు’ బ్రాండ్‌ పేరుతో ఈజిప్ట్‌ దేశానికి ఎగుమతి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మండలంలోని మనోహరాబాద్‌లో పసుపు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ పరిశ్రమను ఎంపీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న పుసుపు పరి శ్రమ జిల్లాకే తలమానికమని అన్నారు. రైతులే స్వ యంగా పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేసు కోవడం అభినందనీయమన్నారు. ఈ పరిశ్రమలో పసుపు ఆయిల్‌ సైతం తీయనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీవోల కోసం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని, రైతు ఉ త్పత్తిదారుల సంఘాల ద్వారా పరిశ్రమలు ఏర్పా టు చేస్తే భారీగా రాయితీలు అందజేస్తుందని తెలిపారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పసుపు బో ర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానీశ్రీ, భూ దాత హిమగిరిరావు, పసుపు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్‌ రెడ్డి, పుప్పాల నగేశ్‌, వెల్మ సంతోష్‌రెడ్డి, భోజన్న, గంగారెడ్డి, శ్రీ ను, రాజ్‌లక్‌పతిరెడ్డి, సురేశ్‌, రైతులు పాల్గొన్నారు.

రైతులు ఏర్పాటు చేసుకున్న

పరిశ్రమ జిల్లాకే తలమానికం

ఎంపీ ధర్మపురి అర్వింద్‌

మనోహరాబాద్‌లో పసుపు

పరిశ్రమ ప్రారంభం

బోధన్‌లో పాకిస్తానీలు..

హిందూ రాష్ట్ర ఏర్పాటు పునాది ఇందూరు గడ్డ అని, ఇక్కడి నుంచే హిందూ రాజ్యస్థాపన ప్రా రంభమవుతుందని అర్వింద్‌ మీడియాతో మా ట్లాడుతూ అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బోధన్‌లో ఒకే ఇంటి నంబర్‌పై 42 పాస్‌పోర్టులు జారీ అయ్యాయన్నారు. బోధన్‌లో పాకిస్తానీలతోపాటు బంగ్లాదేశీలు ఉన్నారని ఆ రోపించారు. తక్షణమే వారిని వెనక్కి పంపాలని డిమాండ్‌ చేశారు. పాకిస్తానీలు వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించినప్పటికీ కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల నుంచి వెళ్లిపోవడం లేదన్నారు. కేంద్రం ఉ గ్రవాదులకు త్వరలో గట్టి జవాబిస్త్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement