నేటి నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు

May 5 2025 8:01 PM | Updated on May 5 2025 8:01 PM

నేటి నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు

నేటి నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా పైలట్‌ ప్రాతిపదికన జిల్లాలోని మెండోరా మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని పేర్కొన్నారు. ఈ బృందాలు షెడ్యూల్‌ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రతి రోజు ఒక్కో బృందం ఒక గ్రామం చొప్పున రోజుకు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి సహకారం అందించేందుకు వీలుగా హెల్ప్‌డెస్క్‌ బృందాలు, దరఖాస్తులను వెంటదివెంట పరిశీలన జరిపేలా వెరిఫికేషన్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 5న చాకిర్యాల, కొడిచెర్ల గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వివరించారు. 6న బుస్సాపూర్‌, మెండోరా గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, 7న వెల్గటూర్‌ జడ్పీ హైస్కూల్‌, సావెల్‌ గ్రామ పంచాయతీలలో, 8న దూదిగాం సీఎస్‌ఐ స్కూల్‌, సోన్‌పేట్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

పైలట్‌ మండలంగా మెండోరా ఎంపిక

రెండు రెవెన్యూ బృందాల

నియామకం

ఉదయం 9 నుంచి సాయంత్రం

4 గంటల వరకు సదస్సులు

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ

హనుమంతు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement