సైబర్‌ నేరాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అవగాహన

Mar 16 2025 1:18 AM | Updated on Mar 16 2025 1:17 AM

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని కోటగల్లీలో ఉన్న పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్మెంట్‌ క్లబ్‌ ప్రోగ్రాంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రెండో టౌన్‌ ఎస్సై యాసిన్‌ అరాఫత్‌, షీ టీం ఎస్సై స్రవంతి హాజరై విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బి మల్లేశం, మాధవి, రజని, గంగా కిషన్‌, శైలేష్‌ దామోదర్‌, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఏఐ ద్వారా విద్యా బోధన ప్రారంభం

సిరికొండ: మండలంలోని రావుట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా విద్యా బోధనను ఎంఈవో రాములు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ఏఐ ద్వారా విద్యార్థులకు బోధన సులభంగా అర్థమయ్యేలా వారే సొంతంగా మూల్యాంకనం చేసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. దీనిని విద్యార్థులకు సక్రమంగా అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో పీజీహెచ్‌ఎం శ్రీనివాస్‌, రాజేశ్వర్‌ హెచ్‌ఎం విజేత, ఉపాధ్యాయులు బాలయ్య, దయాల్‌ సింగ్‌, ఉమా, శేఖర్‌, వీణ, శివాణి, నవిత, విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను కలిసిన

ఆర్టీఏ సభ్యుడు

నిజామాబాద్‌ సిటీ: ఆర్టీఏ సభ్యుడిగా నియామకమైన రాజ నరేందర్‌గౌడ్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతును శనివారం సమీకృత కలెక్టరేట్‌ సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌హందాన్‌, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

తెయూకు ఈశ్వరీబాయి పేరు పెట్టాలి

నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి తెలంగాణ పోరాట యోధురాలు ఈశ్వరీ బాయి పేరు పెట్టాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆల్‌ మాల స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్‌ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం జైలు పాలైన మొట్టమొదటి మహిళా నాయకురాలు ఈశ్వరీ బాయి అని అన్నారు. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. కార్యక్రమంలో అలుక కిషన్‌, గంట సదానందం, సిద్ధిరాములు, కొక్కెర భూమన్న, మోహన్‌ రావు, సక్కి ఉదయ్‌, గొరికంటి లింగన్న, వెంకట రమణ, కిరణ్‌ అనుపాల్‌, ఇత్వర్పెట్‌ లింగన్న, అజయ్‌, అర్గుల్‌ సురేశ్‌, తర్ల లక్ష్మణ్‌, గోలెం అరుణ్‌, అచ్చుత్‌, రవి, రాము తదితరులు పాల్గొన్నారు.

రాయితీని

వినియోగించుకోవాలి

ఆర్మూర్‌టౌన్‌: ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌పై అందిస్తున్న 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు వినియోగించుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు అన్నారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించిన వారికి ప్రొసీడింగ్‌ కాపీలను అందజేశారు. ఈనెల 31 వరకు 25 శాతం రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

సైబర్‌ నేరాలపై అవగాహన 1
1/3

సైబర్‌ నేరాలపై అవగాహన

సైబర్‌ నేరాలపై అవగాహన 2
2/3

సైబర్‌ నేరాలపై అవగాహన

సైబర్‌ నేరాలపై అవగాహన 3
3/3

సైబర్‌ నేరాలపై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement