మోపాల్: హోలీ పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగపల్లిలో శుక్రవారం వసంతోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో జన్మించిన దూడకు రంగులు పూసి వసంతోత్సవాన్ని మొదలుపెట్టారు. అలాగే అర్చకులు ఒకరినొకరు రంగులు చల్లుకున్నారు.
ఉత్తర తిరుపతిలో..
నిజామాబాద్ రూరల్: నగరంలోని గంగాస్థాన్ ఫేజ్–2లోగల ఉత్తర తిరుపతిలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడారు.
ఇందూరు తిరుమలలో వైభవంగా వసంతోత్సవం
ఇందూరు తిరుమలలో వైభవంగా వసంతోత్సవం
ఇందూరు తిరుమలలో వైభవంగా వసంతోత్సవం