ఆర్మూర్టౌన్: పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలోని, రోడ్డు పక్కల ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించారు. కాలనీవాసులు గోసికొండ అశోక్, కమలాకర్, సత్యనారాయణగౌడ్, కొంతం రాజు, సాయ న్న, ఎర్ర భూమయ్య, ఎల్టీ కుమార్, రవి, భాజన్న పాల్గొన్నారు.
అన్నదాతలను ఆదుకోవాలి
బోధన్రూరల్(బోధన్): రాష్ట్రంలో ఇటీవల తు పాన్ వల్ల నష్టపోయిన బాధితులను, రైతుల ను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో ఆదివారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. అధికారులు తడిసిన ధాన్యా న్ని కొనాలన్నారు. ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, కల్తీ విత్త నాలు లేకుండా చూడాలన్నారు. ధాన్యాన్ని వి క్రయించిన రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గంగాధరప్ప, భూమన్న, దేవేందర్సింగ్, లక్ష్మ ణ్, నాగలక్ష్మి, విజయ, పద్మ పాల్గొన్నారు.