నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Oct 19 2025 6:47 AM | Updated on Oct 19 2025 6:49 AM

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 10లోu

బాసరలో శృంగేరీ పీఠాధిపతి..

బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో శృంగేరీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ మహాస్వామివారు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిర్మల్‌టౌన్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంచారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట వివిధ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఉదయం 7 గంటల నుంచే బీసీ కుల సంఘాలు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పార్టీలు బీసీ నినాదాలతో ర్యాలీలు నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బంద్‌లో భాగంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేలా అన్ని పార్టీల నాయకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

నిర్మానుష్యంగా నిర్మల్‌

ఆర్టీసీ బస్టాండ్‌

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement