పక్కాగా పంటల లెక్క | - | Sakshi
Sakshi News home page

పక్కాగా పంటల లెక్క

Oct 20 2025 9:22 AM | Updated on Oct 20 2025 9:22 AM

పక్కా

పక్కాగా పంటల లెక్క

● ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు ● రైతుల ప్రయోజనం కోసమే.. ● గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాల లెక్క పక్కాగా లేకపోవడంతో దిగుబడులు విక్రయించేటపుడు ఇబ్బందులెదురయ్యేవి. ప్రస్తుత డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌తో అలాంటి ఇబ్బందులకు తావుండదు. ● ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు నష్టపోయిన పంటల వివరాలు కచ్చితంగా తెలుసుకునే అవకాశముంటుంది. ● గతంలో దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పంట దిగుబడులు కొని మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరిట విక్రయించిన ఘటనలున్నాయి. వీటికి చెక్‌ పెట్టడానికి పంటల నమోదు ఉపయోగకరంగా ఉంటుంది.

లక్ష్మణచాంద: కొనుగోలు కేంద్రాల్లో పంట దిగుబ డులు విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి డిజిటల్‌ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని 19మండలాల్లోని 400 గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఏఈవోలు నమోదు చేస్తున్నారు.

3,66,430 ఎకరాల వివరాలు నమోదు

జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ఏఈవోలు ప్రతీ పంట ఫొటో తీసి మొబైల్‌ యాప్‌లో పూర్తి స మాచారాన్ని అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందులో మహిళా ఏఈవోలు 1,800 ఎకరాలు, పురుష ఏఈవోలు 2వేల ఎకరాల్లోని పంటల వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా వరి 1,14,638 ఎకరాలు, పత్తి 1,26,075, సోయాబీన్‌ 1,07,052, మొక్కజొన్న 12,835, కంది 5,719, పెసర 52, మినుము 59 ఎకరాలకు సంబంధించి పంటల నమోదు పూర్తి చేశారు.

రైతులకు కలిగే ప్రయోజనాలు

ఇప్పటికే 95శాతం పూర్తి

వ్యవసాయశాఖ ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన పంటల వివరాల నమోదు 95శాతం పూర్తయింది. మిగతా ఐదు శాతం త్వరగా పూర్తి చేస్తాం.

– అంజిప్రసాద్‌, డీఏవో

పక్కాగా పంటల లెక్క1
1/1

పక్కాగా పంటల లెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement