అమ్మకానికి దొడ్డు బియ్యం | - | Sakshi
Sakshi News home page

అమ్మకానికి దొడ్డు బియ్యం

Sep 23 2025 7:19 AM | Updated on Sep 23 2025 7:19 AM

అమ్మకానికి దొడ్డు బియ్యం

అమ్మకానికి దొడ్డు బియ్యం

● ఆరు నెలల తర్వాత మోక్షం ● ఈ–వేలం వేయాలని ప్రభుత్వ నిర్ణయం ● జిల్లాలో 4,535 మెట్రిక్‌ టన్నుల బియ్యం

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏప్రిల్‌ నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో మార్చి నాటికి గోదాంల ఉన్న దొడ్డు బియ్యం నిల్వలు పురుగులు, ఎలుకలకు ఆ హారంగా మారాయి. బఫర్‌ గోదాంలు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, రేషన్‌ షాపుల్లో నిల్వ ఉన్న బియ్యం నా ణ్యత దెబ్బతింటుంది. దీంతో వివిధ గోదాముల్లో నిల్వ ఉన్న 4,535.551 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బి య్యం ఈ–వేలం వేయాలని నిర్ణయించింది. కిలో బియ్యాన్ని రూ.24 బేస్‌ ధరగా నిర్ణయించి, పారదర్శకంగా విక్రయించేందుకు విధివిధానాలు రూపొందించింది. దీంతో కొత్త యాసంగి ధాన్యం, వా నాకాలం బియ్యం నిల్వకు స్థలం లభిస్తుంది. వేలం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

జిల్లాలో మిగిలి ఉన్న దొడ్డు బియ్యానికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో నిల్వ ఉన్న 4535.551 మెట్రిక్‌ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఆదేశానుసారం విక్రయించనున్నాం.

– సుధాకర్‌, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ మేనేజర్‌

జిల్లా వ్యాప్తంగా దొడ్డు బియ్యం నిల్వలు మెట్రిక్‌ టన్నుల్లో..

మాటెగాం బఫర్‌ గోదాం

537.698 మెట్రిక్‌ టన్నులు

లోకేశ్వరం బఫర్‌ గోదాం :

1177.470 మెట్రిక్‌ టన్నులు

మామడ బఫర్‌ గోదాం:

1988.168 మెట్రిక్‌ టన్నులు

జామ్‌ బఫర్‌ గోదాం :

422.690 మెట్రిక్‌ టన్నులు

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు (నిర్మల్‌, భైంసా, ముధోల్‌, ఖానాపూర్‌):

364.643 మెట్రిక్‌ టన్నులు

412 రేషన్‌ షాపులు:

409.525 మెట్రిక్‌ టన్నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement