
నిండుకుండలా ‘ఎల్లంపల్లి’
ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్కు గాను 147.58 మీటర్లకు 148, 20.175 టీఎంసీలకు గాను 20.175 టీఎంసీలతో ఉంది. ఇన్ఫ్లో కింద 1,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ ఫ్లో కింద హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 315 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. 2 గేట్లు తెరిచి 1,185 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిపెడుతున్నారు. – మంచిర్యాలరూరల్(హాజీపూర్)