దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి

Sep 4 2025 5:45 AM | Updated on Sep 4 2025 5:45 AM

దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి

దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి

ఖానాపూర్‌: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపైన 11శాతం దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవాలని ఏఐయూకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్‌ చేశారు. సంయుక్త కిసాన్‌ మో ర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు బుధవారం ప ట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీ ల్దార్‌ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్తి రైతులకు న ష్టం చేకూర్చేలా వివిధ దేశాల్లో వచ్చే పత్తికి దిగుమతి సుంకాలను తగ్గిస్తూ మన దేశ రైతులకు నష్టమయ్యే పరిస్థితిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆరోపించారు. ఓ వైపు పెట్టుబ డులు రాక, గిట్టుబాటు లేక పత్తి రైతులు ఆందోళన చెందుతుంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అ మలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్‌, జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు భూక్య రమేశ్‌, నాగెల్లి నర్సయ్య, గోరెబాయ్‌, బీ నర్సయ్య, నారాయణ, భీమేశ్‌, రాజేశ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement