అక్రమ పట్టా రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ పట్టా రద్దు చేయాలి

Aug 26 2025 8:38 AM | Updated on Aug 26 2025 8:38 AM

అక్రమ పట్టా రద్దు చేయాలి

అక్రమ పట్టా రద్దు చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: భైంసా మండలం హంపోలి గ్రా మంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను మళ్లీ అక్రమంగా చేసిన పట్టా రద్దు చేయాలని సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్‌ చేశారు. ఆ స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అదనపు కలెక్టర్‌కి వినతి పత్రం అందించారు. 1983లో వరదల కారణంగా 16/ఆ, 16/ఈ సర్వే నంబర్‌ లోని ఐదు ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ఇళ్లను కూల్చి.. స్థలాన్ని ఇతరులకు అక్రమంగా పట్టా చేశారన్నారు. దీనిని రద్దు చేయాలని తహసీల్దార్‌, ఆర్డీవో పై అధికారులకు నివేదికలు పంపినా రద్దు కాలేదన్నారు. అక్రమ పట్టా చేసిన అప్పటి తహసీల్దార్‌పై చర్య తీసుకోవాలని, అక్రమ పట్టాను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత, గ్రామస్తులు విఠల్‌, గంగారం, సాయినాథ్‌, బాబు, ఎల్లన్న, భోజన్న, నరసన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement