
చివరి దశకు సిరాల
నిర్మల్
అపు‘రూప’ శిల్పి
మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. అన్నాడు ఓ సినీ కవి. ఆ పదాలను గట్టిగా పట్టుకున్న కుభీర్కు చెందిన యువకుడు శిల్ప కళలో రాణిస్తున్నాడు.
నీటి కోసం ఎదురుచూపు
శనివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2025
10లోu
ఏడాదికి 200 పని దినాలు కల్పించాలి
నిర్మల్చైన్గేట్: ఉపాధి హామీ కూలీల కూలి రూ.600 పెంచి ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నారు. ఉపాధి హామీ పనుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతోపాటు ఇతర సిబ్బంది పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధి బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెంచాలని, ఉదయం సాయంత్రం రెండు ఫొటోలు తీసి పంపాలనే నిబంధన తొలగించాలన్నారు. ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బర్కుంట గంగారం, తిమ్మాపురం ముత్తన్న నాయకులు చింతకుంట శంకర్, కదాం దినేష్, బీరోళ్ల నవీన్, కూలీలు కూతాడి విజయ, నీలగిరి పోసాని పాల్గొన్నారు.
భైంసారూరల్: రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు చివరి దశకు చేరుకున్నారు. దీంతో 1,800 ఎకరాల ఆయకట్టు రైతుల్లో సాగునీటి ఆశలు చిగురిస్తున్నాయి. ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్ పనులను పర్యవేక్షిస్తూ అధి కారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించి, అధికా రులతో సమీక్ష నిర్వహించారు. రైతులతో సమావేశమై, త్వరలోనే నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాన తూము నిర్మాణం..
ప్రాజెక్టు ప్రధాన తూము నిర్మాణం చివరి దశలో ఉంది. పాత తూము స్థానంలో సిమెంటుతో కొత్త షెట్టరు నిర్మిస్తున్నారు. నిజాం కాలంలో 1902లో రాతి, సున్నంతో నిర్మించిన పాత తూము లీకేజీలతో నీరు వృథాగా బయటకు వచ్చేది. భారీ వర్షాలతో తెగిపోయిన ఈ తూమును ఇప్పుడు నూతన టె క్నాలజీతో నిర్మిస్తున్నారు. సీసీ డ్రైనేజీ నుంచి నీరు తూము ద్వారా కాలువలకు చేరేలా డిజైన్ చేశారు.
కట్ట నిర్మాణం..
తెగిపోయిన కట్టను చదును చేసి, దాని అడుగు భాగంలో బండరాళ్లు పేర్చారు. చుట్టూ మట్టి, మొరం వేస్తున్నారు. ప్రధాన కట్ట నిర్మాణం చివరి దశలో ఉంది. భారీ టిప్పర్లతో మొరం, మట్టి వేస్తూ, నీరు నిల్వ ఉన్నా కట్ట తెగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వందల ఏళ్ల క్రితం నిర్మితమైన సిరాల ప్రాజెక్టు భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా విపత్తు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలం ముందు పనులు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
కాలువలకు మరమ్మతు..
ప్రాజెక్టు పనులు తుది దశలో ఉన్న సమయంలో కాలువలపై దృష్టి సారించాలని ఇరిగేషన్ అధికారులను రైతులు కోరుతున్నారు. ఎనిమిది కిలోమీటర్ల సీసీ కెనాల్కు భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల గండ్లు పడ్డాయి. కెనాల్లోని మట్టి, చెత్త, పిచ్చిమొక్కలను తొలగించి, తూముల మరమ్మత్తులు చేపట్టాలి. సిరాల, ఇలేగాం గ్రామాల మధ్య కెనాల్ పూర్తిగా అధ్వాన్నంగా ఉంది. కాలువలపై శ్రద్ధ పెడితే పంట పొలాలకు నీరు సజావుగా అందుతుందని రైతులు పేర్కొంటున్నారు.
నీరందిస్తాం
సిరాల ప్రాజెక్టు పనులు చివరి దశకుచేరుకున్నాయి. పనులు పూర్తి చేసి ఈ సీజన్లో రైతులకు నీరందించే విషయంపై దృష్టిపెడతాం. ఇప్పటికే ప్రధాన కట్ట పనులు చివరి దశకుచేరుకున్నాయి. ప్రధాన తూము, షెట్టరు పనులు కొనసాగుతున్నాయి. ఆయకట్టు రైతులకు నీటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – అనిల్, ఇరిగేషన్ డీఈ
న్యూస్రీల్
సీసీ రోడ్ల పరిశీలన
లక్ష్మణచాంద: మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను పంచాయతీరాజ్ డీఈ యాదగిరి శుక్రవారం పరిశీలించారు. మండలంలోని రాచాపూర్, పొట్టపెల్లి(కె) గ్రామంలో ఇటీవల వేసిన సీసీ రోడ్లను, దుర్గామాత షెడ్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏఈ సంజయ్కుమార్ ఉన్నారు.
80శాతం పనులు పూర్తి
సాగునీటిపై రైతుల ఆశ
వేగంగా ప్రధాన తూము పనులు
సిరాల ప్రాజెక్టు నిర్మాణం ఈ ఏడాది పూర్తయి పంటలకు నీరు అందుతుందని ఆయకట్టు రైతులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా నీరు అందక రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. సిరాల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో తానూరు మండలంలోని ఝరి, బెంబర, బోరిగాం, ఉమ్రి, బోల్సా, బోసి, బోంద్రట్, భైంసా మండలంలోని ఇలేగాం, పాంగ్రి, మాంజ్రి, దేగాం గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. ప్రాజెక్టులో నీరు నిలిచి ఉంటే, భూగర్భ జలాలు పెరిగి, తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తేవి కావు.
ప్రధాన తూము, షెట్టరు పనులు

చివరి దశకు సిరాల

చివరి దశకు సిరాల