నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

May 31 2025 12:58 AM | Updated on May 31 2025 12:58 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న అరుణ్‌ ఏజెన్సీ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. దుకాణంలోని విత్తనాలు, పురుగుమందుల ప్యాకింగ్‌, లేబుళ్లు, అమ్మకాల రిజిస్టర్లు, నిల్వల వివరాలు పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ నకిలీ విత్తనాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిషేధించిన మందులు విక్రయించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రెగ్యులర్‌గా దుకాణాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట వ్యవసాయ అధికారి రాజశేఖర్‌, తహసీల్దార్‌ రాజు, అధికారులు ఉన్నారు.

యూనిఫాం స్టిచ్చింగ్‌ నాణ్యతగా ఉండాలి..

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాం(ఏకరూప దుస్తులు) స్టిచ్చింగ్‌ నాణ్యంగా ఉండేలా చూడాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఈద్గాం, మంజులాపూర్‌లో ఏర్పాటు చేసిన యూనిఫాం స్టిచ్చింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇవ్వబోయే దుస్తులు కచ్చితంగా కొలతలకు తగినట్లుగా ఉండాలన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థులకు యూనిఫాంలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్డీవో విజయలక్ష్మి, మెప్మా పీడీ సుభాష్‌, విద్యాశాఖ అధికారులు లింబాద్రి, ప్రవీణ్‌, తహసీల్దార్‌ రాజు ఉన్నారు.

పుకార్లు నమ్మొద్దు

నిర్మల్‌చైన్‌గేట్‌: ముధోల్‌ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య ప్రచారా లు, పుకార్లు వ్యాప్తి చేయడానికి యత్నిస్తున్నట్లు గుర్తించామని, వాటిని నమ్మొద్దని కలెక్టర్‌ అభిలా ష అభినవ్‌ సూచించారు. బోరెగాం గ్రామంలోని సర్వే నంబరు 249 లోని ప్రభుత్వ భూమిని ఇటీవల కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు య త్నించగా రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత భూమి హద్దులను గుర్తించా రు. ఆక్రమణలు తొలగించారు. ఈ ఘటన నేపథ్యంలో రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే విభాగాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ని జిల్లా యంత్రాంగం నియమించిందన్నారు. ప్రస్తుతం ఆ కమిటీ విచారణ కొనసాగిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో అక్రమాలు చోటుచేసుకోకుండా నివారించేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతుందని పేర్కొన్నా రు. బోరెగాం గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement