
ఇంకుడుగుంతల పరిశీలన
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో ఈజీఎస్ కింద నిర్మించిన ఇంకుడుగుంతల ను సెంట్రల్ వాటర్ కమిటీ మెంబర్ సతీశ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు తోడ్పడుతా యని తెలిపారు. జలశక్తి అభియాన్లో భా గంగా కేంద్ర అవార్డు కోసం ఇంకుడుగుంత ల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫైనాన్స్ మేనేజర్ సందీప్, ఎంపీడీవో లింబాద్రి, ఏపీవో నవీన్, టీఏలు మా ధురి, శశిధర్, జైసింగ్, దేశ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలున్నారు.