● ప్రతిపనికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే ● ‘రెవెన్యూ’ సెక్షన్‌లోనే వరుస దాడులు ● తాజాగా ఏసీబీకి చిక్కిన ఉద్యోగులు ● గతంలోనూ ఆఫీసర్లు పట్టుబడిన వైనం | - | Sakshi
Sakshi News home page

● ప్రతిపనికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే ● ‘రెవెన్యూ’ సెక్షన్‌లోనే వరుస దాడులు ● తాజాగా ఏసీబీకి చిక్కిన ఉద్యోగులు ● గతంలోనూ ఆఫీసర్లు పట్టుబడిన వైనం

Jun 6 2025 1:15 AM | Updated on Jun 6 2025 1:15 AM

● ప్రతిపనికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే ● ‘రెవెన్యూ’ సెక్షన

● ప్రతిపనికీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే ● ‘రెవెన్యూ’ సెక్షన

నిర్మల్‌: ‘అరె.. మున్సిపాలిటీలో పనుందిరా..’ అని ఎవరైనా అంటే వెంటనే.. ‘ఎంతోకొంత ఇస్తే నే పనైతుందిరా..’ అని టక్కున చెబుతున్నారంటే.. ఇక్కడ పైసావసూల్‌ ఏ స్థాయిలో ఉందో అ ర్థం చేసుకోవచ్చు. ఇందుకు వరుసగా జరుగుతు న్న అవినీతి నిరోధకశాఖ దాడులే నిదర్శనం. ఓవై పు ఇలా వరుసగా ఏసీబీ దాడులవుతున్నా.. ప్రధానంగా రెవెన్యూ సెక్షన్‌ తీరుమారక పోవడం గమనార్హం. ఇంటి నంబర్‌ ఇవ్వడానికి రూ.ఆరువేల లంచం తీసుకుంటూ గురువారం నిర్మల్‌ మున్సి పాలిటీ రెవెన్యూ విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జి ఆర్‌ఐ సంతోష్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగి షో యబ్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వాళ్లు చే యాల్సిన పనే అయినా.. అందుకు సరిపడా ప్రభుత్వం వేతనం ఇస్తున్నా.. అదనంగా లంచం ఇవ్వనిదే మున్సిపాలిటీల్లో ఏ పనీ చేయడం లేదు.

దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా..

జిల్లాలో అవినీతి నిరోధకశాఖ అధికారులు తర చూ దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. వ సూలు రాజాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతీ పని కో రేటు కడుతూ వసూలు చేస్తూనే ఉన్నారు. తమ వద్ద పనికోసం వచ్చింది పెద్దోడా.. పేదోడా.. అనే తేడా కూడా చూడకుండా ఎంతో కొంత ఇవ్వాల్సిందే అంటున్నారు. ప్రధానంగా మున్సిపల్‌, రె వెన్యూశాఖల్లో ఈ తరహా లంచావతారులు చాలా మంది ఉన్నారు. ఇందులో కొంతమంది బాహా టంగానే డబ్బులు ఆశిస్తూ పనులు చేస్తుండగా, మరికొందరు కిందిస్థాయి, కాంట్రాక్ట్‌, అవుట్‌సో

ర్సింగ్‌ సిబ్బంది ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నా రు. అధికారుల వసూళ్ల దాహానికి గతంలో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బంది బలయ్యారు.

‘రెవెన్యూ’లో దోపిడీపర్వం

బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ ఉంటాయన్న ట్లు డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే లంచాల లెక్కలు ఉంటున్నాయి. రెవెన్యూశాఖ అంటేనే చాలా మంది అధికారులు, సిబ్బంది పైసా ఇవ్వనిదే పని చేయరన్న పేరుంది. ఇక మున్సిపాలిటీల్లోని రెవె న్యూ విభాగమూ అదే దారిలో నడుస్తోంది. సకా లంలో పన్నులు వసూలు చేయని ఈ సెక్షన్‌ పైసలు దండుకునే పనిలో ఉందన్న ఆరోపణలున్నా యి. ఒక్క నిర్మల్‌ మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలోనే ఏడాది వ్యవధిలో ముగ్గురు అధికారులు, సి బ్బంది ఏసీబీకి పట్టుబడ్డారంటే.. ఈ సెక్షన్‌లో ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయో అంచనా వేయొచ్చు. ప్రధానంగా ఇంటినంబర్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యి. ప్రభుత్వ స్థలాలకూ ఇంటినంబర్లు కేటాయిస్తూ.. కబ్జా చేసుకోవడానికి అవకాశమిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఏసీబీ దాడికి సస్పెన్షన్‌కు గురైన అధికారికి బాధ్యతలు ఇవ్వడంపైనా ఫిర్యాదులున్నాయి. అయినా కలెక్టర్‌, స్థానిక సంస్థలను చూసుకోవాల్సిన అడిషనల్‌ కలెక్టర్‌ స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

స్థాయిని బట్టి వసూళ్లు

నెలనెలా ప్రభుత్వం ఇచ్చే వేతనాన్ని చాలామంది అధికారులు, సిబ్బంది లెక్కలోకి తీసుకోవడం లే దు. తాము చేయాల్సిన పనే అయినా.. ‘ఈ పని చేస్తే నాకేంటి..’ అన్నట్లుగా కొందరు ఉన్నతాధికా రులే మాట్లాడుతున్నారు. కొంతమంది అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనపై సదరు కార్యాలయాల్లో పనిచేసేవాళ్లే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. లంచాలు తీసుకునే సార్లతోపాటు సర్కారు చేసే పనుల్లో వాటాలు చూసుకునే అవినీ తిపరులూ తక్కువేం లేరు. జిల్లాలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ఎవరిస్థాయిని బట్టి వారు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

నిర్మల్‌ మున్సిపల్‌ కార్యాలయం

జిల్లాలోని పలు ఘటనలు

గతేడాది జనవరి 25న నిర్మల్‌ మున్సిపాలిటీ రెవెన్యూ ఆఫీసర్‌ (ఆర్వో) గంగాధర్‌, బిల్‌కలెక్టర్‌ నవంత్‌ ఓ ఇల్లు అసెస్‌మెంట్‌కు సంబంధించి రూ.3,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

గతేడాది నవంబర్‌ 13న నిర్మల్‌ మున్సిపల్‌లో ఇన్‌చార్జి ఆర్‌ఐ, ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీ–సెక్షన్‌)ను కూడా చూస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ షాకీర్‌ఖాన్‌ తమ విభాగంలోనే పనిచేసే బిల్‌కలెక్టర్‌ భరత్‌కు సంబంధించి సర్వీస్‌బుక్‌లో నమోదు కోసం రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

తాజాగా ఇంటినంబర్‌ కేటాయింపు కోసం రూ.6వేలు వసూలు చేస్తూ ఇన్‌చార్జి ఆర్‌ఐ సంతోష్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది షోయబ్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement