
● రూ.6వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ అవుట్
ఆశపడ్డారు.. పట్టుబడ్డారు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. బాధితుడు తన గృహానికి ఇంటి నంబర్ కేటాయించడానికి అవుట్ సోర్సింగ్ ఉ ద్యోగి షోయబ్కు రూ.6వేలు ఇస్తుండగా అధి కారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆది లాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ ఇంటి యజమాని ఇటీవల ఇంటి నిర్మాణం పూర్తి చేశాడు. ఆ ఇంటికి సంబంధించిన అసిస్మెంట్ (ఇంటి నంబర్) కోసం చలానా కట్టి మున్సిపల్ రెవెన్యూ సెక్షన్లోని సంబంధిత అ ధికారులను కలిశాడు. ఇందుకు రూ.6వేలు లంచం ఇవ్వాలని అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్ షోయబ్ అహ్మద్ డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆ యజ మాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వా రి సూచన మేరకు ఆ యజమాని బిల్ కలెక్టర్కు లంచం ఇస్తుండగా గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులు షోయబ్ను విచారించగా.. లంచం తీసుకునేలా సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జ్ ఆర్ఐ సంతోష్ ప్రోత్సహించారని తెలిపాడు. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎ స్పీ తెలిపారు. ప్రభుత్వశాఖల ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 లేదా 9440446108 నంబర్లకు తెలుపాలని, సమాచారం ఇచ్చిన వా రివివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
నిర్మల్ మున్సిపల్లో ఏసీబీకి పట్టుబడ్డ ఇన్చార్జి ఆర్ఐ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి