
చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి
నిర్మల్టౌన్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగా హన కలిగి ఉండాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూ చించారు. గురువారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ది వ్యపార్క్లో వాకర్స్కు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొక్క నాటారు. అనంతరం వివిధ చట్టాల గురించి తెలిపారు. బాలికల చట్టాల వినియోగాన్ని వివరించారు. కార్యక్రమంలో సెషన్స్ జడ్జి రాధిక, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారానికి
దరఖాస్తు చేసుకోవాలి
మామడ: భూసంబంధిత సమస్యలపై దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం మండలంలోని ఆరేపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. దరఖాస్తుల వివరాలను అధికా రులు రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినో త్సవం సందర్భంగా గ్రామంలో మొక్క నాటా రు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో సుశీల్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలి