నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 5 2025 7:42 AM | Updated on Jun 5 2025 7:42 AM

నిర్మ

నిర్మల్‌

పర్యావరణమే పరమౌషధం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గుతుండగా ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తంజేస్తున్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కథనం..
పంట మార్పిడి విధానమే మేలు

గురువారం శ్రీ 5 శ్రీ జూన్‌ శ్రీ 2025

12లోu

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

భైంసాటౌన్‌: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ జానకీ షర్మి ల సూచించారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులకు ఫోన్‌లో సూచనలు చేశారు. అలాగే భరోసా కేంద్రంలో కుటుంబ కలహాలకు సంబంధించి కేసుల్లో ఇరు పార్టీలకు కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌, సీఐలు గోపీనాథ్‌, నైలు, మల్లేశ్‌, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సమ్మయ్య, ఎస్సైలు శ్రీనివాస్‌, శంకర్‌, మహిళా ఎస్సై పెర్సిస్‌, షీ టీమ్‌ సిబ్బంది, క్యాంప్‌ ఇన్‌చార్జి రఘువీర్‌ పాల్గొన్నారు.

నిర్మల్‌: ఊరూరా.. వాడవాడలా.. జిల్లా నలుమూలలా గంజాయి భూతం వ్యాపించింది. యువతరా న్ని మత్తుకు బానిసలుగా మార్చి, వారి జీవితాలను నాశనం చేస్తోంది. దారుణమేమంటే.. బడీడు పిల్ల ల భవితనూ పీల్చేస్తోంది. నాలుగు డబ్బులు సంపాదించాలన్న కొంతమంది స్వార్థం సమాజాన్ని నాశ నం చేసే దిశగా తీసుకెళ్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా గంజాయిదందా విస్తరించడం ఆందోళనకరమైన విషయం.

కొందరి స్వార్థం.. సమాజం నాశనం

కుభీర్‌ నుంచి కడెం దాకా జిల్లావ్యాప్తంగా గంజా యి గుప్పుమంటోంది. పోలీసులు, ఎక్సైజ్‌ అధికా రులు చేస్తున్న దాడుల్లో మారుమూల పల్లెలు, తండాల్లో గంజాయి సాగుతో పాటు మత్తుమందును పీలుస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్తు జిల్లాకేంద్రంలోనే కొన్ని శివారు ప్రాంతా లు గాంజా అడ్డాలుగా మారాయి. అడ్డదారుల్లో ఎ క్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలన్న కొంతమంది స్వార్థానికి సమాజమే నాశనమవుతోంది. తక్కువ పైసలతో ఎక్కువ మత్తు వస్తుందంటూ యువతను గంజాయివైపు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల గంజాయితో పాటు మత్తుమందు ఇంజక్షన్‌ల ను విక్రయిస్తున్న ముఠా ఏకంగా జిల్లాకేంద్రంలోనే వెలుగులోకి రావడం తెలిసిందే. యువతతో మత్తు ఎక్కించడమే కాకుండా వారినే విక్రేతలుగా మారుస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి గంజాయి వస్తోంది. గతంలో కొంతమంది యువకులు జిల్లా నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి గంజాయి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

బడీడు పిల్లలకూ..

జిల్లాలో గంజాయి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువత వరకే ఆగిపోకుండా ఈ మత్తు బడీడు పిల్లలకూ చేరుతోంది. జిల్లాకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోనూ బడిపిల్లలు గంజాయి బారినపడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది గంజాయికి బానిసలుగా మారి, డబ్బుల కోసం తమ ఇంట్లోనే దొంగతనాలు చేసిన దాఖలాలున్నాయి. పలువురు యువకులు రో డ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలూ కోల్పోయా రు. ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్ల లను డీ అడిక్షన్‌ కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. స్థాని కంగా కాకుండా నిజామాబాద్‌, హైదరాబాద్‌ ఆస్పత్రులకు వెళ్లి మానసిక చికిత్స చేయిస్తున్నారు.

పెరుగుతున్న ఫిర్యాదులు

జిల్లాలో రోజురోజుకూ గంజాయి తీవ్రతతో పాటు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, ఎస్పీ జానకీషర్మిల సమష్టి నిర్ణయం తీసుకున్నారు. గంజాయి విముక్త నిర్మల్‌ జిల్లా చే యాలన్న లక్ష్యంతో ‘డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్తుమందులపై ఉక్కుపాదం మోపేందుకు అందరి సహకారం కావాలంటున్నా రు. ఇప్పటికే ‘గాంజా గస్తీ’ పేరిట ఎస్పీ జానకీషర్మి ల పకడ్బందీగా గంజాయి అమ్మకాలపై దాడులు చే పడుతున్నారు. మత్తుపదార్థాలకు సంబంధించి స మాచారం 8712659599 నంబర్‌లో ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. ఈ నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులు, వరుస తనిఖీల ఆధారంగా కొంతకాలంగా చాలా మంది గంజాయి విక్రేతలను పట్టుకుంటున్నారు.

అవగాహన కల్పించేందుకు..

అవగాహన లోపం కారణంగానే ఎక్కువమంది యువకులు, విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నట్లు తేలడంతో ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌’లో భాగంగా బుధవారం జిల్లాకేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ బృందానికి సంబంధించిన వాహనా నికి పచ్చజెండా ఊపారు. జిల్లా పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి బృందాలతో జిల్లా నలుమూలలా గంజాయితో కలిగే అనర్ధాలతో పాటు బాల్యవివాహాలు, బాలకార్మికులు తది తర అంశాలపైనా అవగాహన కల్పించనున్నట్లు క లెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో విష్ణువర్ధన్‌, కళాకారులు సుదర్శన్‌, నాగరాజు, రఘునాథ్‌, లక్ష్మణ్‌, మాధవి తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌ ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

‘పది’ సప్లిమెంటరీకి

ఏడుగురు గైర్హాజరు

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో బుధవారం నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మందికి గాను నలుగురు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నిర్వహణ అధి కారి ముడారపు పరమేశ్వర్‌ తనిఖీ చేశారు.

న్యూస్‌రీల్‌

డీఎస్సీ–2024 టీచర్‌కు షోకాజ్‌ నోటీస్‌!

నిర్మల్‌ రూరల్‌: డీఎస్సీ–2024లో నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందినందుకు రాష్ట్ర విద్యాశా ఖ అధికారులు ఓ ఉపాధ్యాయునికి షోకాజ్‌ నో టీస్‌ జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశా రు. జిల్లాకు చెందిన గైని సునీల్‌కుమార్‌ డీఎస్సీ–2024లో ఎస్జీటీ ఉద్యోగం పొందాడు. సర్టిఫికె ట్‌ వెరిఫికేషన్‌ సమయంలో అతను నకిలీ పత్రాలు అందించి ఉద్యోగం పొందినట్లు విద్యాశాఖ కు ఫిర్యాదులు అందాయి. రాష్ట్రంలోని ఇతర జి ల్లాల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు అందడంతో విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా వి చారణ చేపట్టారు. విచారణలో గైని సునీల్‌ అందించిన స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్‌ నకిలీదని తేలింది. దీంతో స్కూల్‌ ఎడ్యుకేషనల్‌ డైరెక్టర్‌ నరసింహారెడ్డి ఉపాధ్యాయుని అనర్హుడిగా ప్రకటించి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాల్సిందిగా డీఈవో రామారావును ఆదేశించారు.

జిల్లాలో ‘మత్తు’పై ఉక్కుపాదం

గంజాయి రహిత జిల్లాకు కృషి

కలెక్టర్‌, ఎస్పీ సంయుక్త కార్యక్రమం

ఊరూరా.. వాడవాడలా అవగాహన

ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

‘గాంజా గస్తీ’ చేపడుతున్న ఎస్పీ

మత్తుతో భవిష్యత్‌ అంధకారం

మత్తుపదార్థాల కారణంగా యువత భవిష్యత్‌ అంధకారమవుతోంది. ఉజ్వల భవిష్యత్‌ను చేతులారా నాశనం చేసుకోవద్దు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించిన ‘డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌’ కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం. మత్తురహిత జిల్లాకు కృషిచేద్దాం. – అభిలాషఅభినవ్‌, కలెక్టర్‌

కలిసికట్టుగా కృషి చేస్తేనే..

జిల్లాలో మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలపై శాఖాపరంగా సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే ‘గాంజా గస్తీ’ చేపడుతున్నాం. యువతను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ ‘డ్రగ్‌ ఫ్రీ నిర్మల్‌’ కోసం ఐక్యంగా ముందుకురావాల్సిన అవసరముంది.

– జానకీషర్మిల, ఎస్పీ

నిర్మల్‌1
1/3

నిర్మల్‌

నిర్మల్‌2
2/3

నిర్మల్‌

నిర్మల్‌3
3/3

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement