
నిర్మల్
నాణ్యతలేని విత్తనం?
ఏటా నాణ్యతలేని విత్తనాలతో జిల్లా రైతులు నష్టపోతూనే ఉన్నారు. కొనుగోలు సమయంలో దుకాణాల నుంచి రశీదులు తీసుకున్నా పరిహారం అందడం లేదు.
10లోu
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025
2020 ఏప్రిల్లో జిల్లాలో తొలి కేసు
జిల్లాలో 2020 ఏప్రిల్లో తొలి కరోనా కేసు నమోదైంది. లాక్డౌన్తో పాటు రకరకాల పద్ధతుల ద్వారా కరోనాను ప్రభుత్వం కట్టడిచేసింది. తిరిగి 2021 మార్చి నెలలో కరోనా రెండవ వేవ్ విజృంభించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా కొందరు మత్యువాత పడిన విషయం తెలిసిందే. 2021 ఏడాది చివరలో కరోనా జీరోకు పడి పోయింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్తో పెద్ద ప్రమాదం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
రైతులకు నాణ్యమైన
విత్తనాలు విక్రయించాలి
భైంసాటౌన్: డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. గురువారం పట్టణంలోని గాంధీగంజ్లో పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లు, ఇతర వివరాలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డీల ర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సూ చించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏడీఏ వీణ, ఏవోలు రవి, గణేశ్ ఉన్నారు.
20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు
కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక వార్డులో 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినవారికి ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ప్రతీ బెడ్కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. కరోనా నివారణకు అవసరమైన మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బెడ్లు
స్వీయ నియంత్రణ పాటించాలి
ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. కరోనా వైరస్పై జిల్లా వైద్యాశాఖ అప్రమత్తంగా ఉంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహిస్తాం. జిల్లాలో ఇంకా కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశాం.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్వో
చికిత్స అందించేందుకు సిద్ధం
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే రోజుకు 800–900 వరకు అవుట్ పేషెంట్లు, 200 మంది ఇన్పేషెంట్లకు చికిత్స చేస్తున్నాం. కోవిడ్, సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేకవార్డులు సిద్ధం చేస్తున్నాం. అవసరమైన మందుల కోసం ఇండెంట్ పెట్టాం.
– గోపాల్సింగ్,
జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
నిర్మల్చైన్గేట్: కొద్దిరోజుల క్రితం దేశంలోకి కోవిడ్ భూతం మళ్లీ ప్రవేశించింది. మరోవైపు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే కాలమిది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హె చ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధ ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తోంది. నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 280 పడకలుండగా అన్నింటికీ ఆక్సిజన్ కనెక్షన్ ఉంది. 10 వేల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. 20 పడకల కోవిడ్ వార్డును అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేశారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో 100 పడకలు ఉండగా ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అన్ని ఆస్పత్రుల్లో మందులు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నిర్మల్తో పాటు జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు కోవిడ్ పరీక్ష కిట్లు రావాల్సి ఉంది. జిల్లా జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కా న్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొ త్తంగా కరోనా కొత్త వేరియంట్తోపాటు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
అప్రమత్తమైన అధికారులు
కోవిడ్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ పరీక్షల నిర్వహణ, చికిత్స కు ఏర్పాట్లు చేస్తున్నారు. మందులు, కిట్లు మొదలైనవి సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రిలో ప్రత్యేకవార్డు సిద్ధం చేస్తున్నారు. వార్డులో బెడ్లు, ఫ్యాన్లు, వెలుతురు వచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాకు పైపులైన్లు సరి చేస్తున్నారు. సీజనల్ వ్యా ధులకు గురయ్యే వారికోసం జీజీహెచ్లో 20 పడకలు, భైంసా ఏరియా ఆస్పత్రి, ఖానాపూర్, నర్సాపూర్ (జి) పీహెచ్సీల్లో బెడ్లు సిద్ధం చేస్తున్నారు.
వాతావరణ మార్పులతో జ్వరాలు
మే మూడో వారం నుంచి వాతావరణం చల్లబడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలు బు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్ వ్యాధులు గానే పరిగణించి వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకుని భయపడవద్దని, వాతా వరణ మార్పులతోనే సీజనల్ వ్యాధులు వస్తుంటాయని వారు చెబుతున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
‘పది’ పరీక్షలకు తొమ్మిది మంది గైర్హాజరు
నిర్మల్ రూరల్: జిల్లాలో గురువారం నిర్వహించిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు మొత్తం 35మంది విద్యార్థులకు 26మంది హాజరు కాగా తొమ్మిది మంది గైర్హాజరయ్యా రు. జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్లోగల బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి పరమేశ్వర్ తనిఖీ చేశారు.
గోరక్ష చట్టాలు అమలు చేయాలి
నిర్మల్చైన్గేట్: చట్టవిరుద్ధంగా కొనసాగుతు న్న గోవధ శాలలను మూసి గోరక్ష చట్టాలను అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. అనంతరం గోరక్ష జిల్లా సంయోజక్ జట్టి వెంకటేశ్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో గుల్జార్ మార్కెట్, బాగులవాడ, పింజరు గుట్ట, గాజులపేట్, ఈద్గం, సోఫీనగర్, విశ్వనాథ్పేట్, బుధవార్పేట్, బోయవాడ ప్రాంతాల్లో జరుగుతున్న గోవధ ను వెంటనే ఆపాలని కోరారు. ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేసి, గు ర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటా యించాలని విజ్ఞప్తి చేశారు. గోఆధారిత వ్య వసాయం చేస్తున్న రైతులు, గోపోషకులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని కోరా రు. జన సమూహాల మధ్య పశుకళేబరాల నుంచి నూనె, టీ పొడి లాంటివి తయారు చేసే కర్మాగారాలు వెంటనే మూసివేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు.
అందుబాటులోకి వచ్చిన సీటీ స్కాన్ యూనిట్
నిర్మల్చైన్గేట్: మొక్క నాటుతున్న అభిలాష అభినవ్
నిర్మల్ రూరల్: మొక్క నాటుతున్న డీఈవో
న్యూస్రీల్
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్