నిబద్ధతతోనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతోనే గుర్తింపు

May 7 2025 12:05 AM | Updated on May 7 2025 12:05 AM

నిబద్ధతతోనే గుర్తింపు

నిబద్ధతతోనే గుర్తింపు

భైంసాటౌన్‌: నిబద్ధతతో విధులు నిర్వహించినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని ఏఎస్పీ అవినాష్‌కుమార్‌ అన్నారు. పట్టణ సీఐ జి.గోపీనాథ్‌ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయనకు మంగళవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆపద సమయంలో స్పందించి సేవలందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు కె.గణేశ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, మహమ్మద్‌గౌస్‌, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement