
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
లోకేశ్వరం మండలం నగర్లో సర్వే నంబర్ 404/7 లో 2.12 ఎకరాల అసైన్డ్ భూమి మా తండ్రి పేరుమీద ఉంది. ఆయన 1995 అక్టోబర్ 24న మృతి చెందాడు. నేను మా తండ్రికి ఒకే సంతానాన్ని. అట్టి భూమిని నా పేరుమీదకు సక్సెషన్ చేయాలని అర్జీ పెట్టుకున్నా. తీరా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి చూడగా అట్టి భూమి భూటి మౌనిక, భర్త మహేష్ పేరుమీద సర్వే నంబర్ 404/7/1పై రెండెకరాల భూమి పట్టా అయినట్లు ఉంది. కేవలం 0.12 గుంటలు భూమి మాత్రమే నా పేరున ఉంది. అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు నా భూమిని నాకు ఇప్పించాలి.ఙ
– గైని పోసాని, లోకేశ్వరం