Udhampur: కాల్పుల కలకలం.. జవాను మృతి.. నలుగురు ఉగ్రవాదుల కోసం వేట | Unfight Between Security Forces And Terrorists In Jammu And Kashmir Udhampur, More Details Inside | Sakshi
Sakshi News home page

Udhampur: కాల్పుల కలకలం.. జవాను మృతి.. నలుగురు ఉగ్రవాదుల కోసం వేట

Sep 20 2025 10:05 AM | Updated on Sep 20 2025 11:43 AM

unfight Between Security Forces and Terrorists in jk Udhampur

ఉధంపూర్: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు గాయపడ్డాడు. ప్రస్తుతం భారత్‌ జరుపుతున్న ఎదురుకాల్పుల్లో జైషే-ఎ-మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు చిక్కుకున్నారు. తొలుత కిష్త్వార్‌లో కాల్పులు జరిగాయని తెలిపిన ఆర్మీ తరువాత ఆపరేషన్ ఉధంపూర్‌కే పరిమితమయ్యిందని పేర్కొంది.

‘ఎక్స్‌’ పోస్ట్‌లో వైట్ నైట్ కార్ప్స్.. దోడా-ఉధంపూర్ సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. నిర్దిష్ట సమాచారం మేరకు, ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ),పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఫలితంగా ముష్కరుల నుంచి కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. గత ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో పలుమార్లు కాల్పులు జరిగాయి. జూన్ 26న డూడు-బసంత్‌గఢ్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఉగ్రవాది హైదర్ హతమయ్యాడు.

ఇతను జైషే మొహమ్మద్‌కు చెందిన టాప్ కమాండర్. గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న, బసంత్‌గఢ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు వీరమరణం పొందారు. దీనికి ముందు జమ్ముకశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ విభాగం కశ్మీర్ లోయలోని  శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్‌లలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం తనిఖీలు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement