
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఖ్యాతి పొందిన శుభాంశు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈరోజు(శనివారం, జూన్ 28) ఐఎస్ఎస్లో ఉన్న శుభాంశు శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.
శుభాంశు శుక్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారని, అక్కడ మిషన్ విజయవంతం కావాలని, భవిష్యత్లో శుభాంశు శుక్లా మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిచినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శుభాంశుతో మోదీ మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేసింది పీఎం కార్యాలయం.
PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd
— PMO India (@PMOIndia) June 28, 2025
#WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.
PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025
కాగా, భారత కాలమానం ప్రకారం బుధవారం(జూన్ 25) మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. ఫలితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు చరిత్ర సృష్టించారు. అయితే 14 రోజుల పాటు ఇక్కడ పరిశోధనలు చేయనుంది శుభాంశు బృందం.