ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Praises Shubhanshu Shukla And His Team | Sakshi
Sakshi News home page

ఇది మనమంతా గర్వించదగ్గ క్షణం: వైఎస్‌ జగన్‌

Jun 26 2025 9:27 PM | Updated on Jun 26 2025 9:32 PM

YSRCP President YS Jagan Praises Shubhanshu Shukla And His Team

తాడేపల్లి:  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుపెట్టిన  శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్‌ జగన్‌ కొనియాడారు.  ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు జగన్‌.

‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్‌ఎస్‌తో  విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్‌ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.


 ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా

ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement