
తాడేపల్లి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుపెట్టిన శుభాంశు శుక్లా బృందానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇది నిజంగా మనందరికీ గర్వకారణమైన క్షణమని వైఎస్ జగన్ కొనియాడారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.
‘28 గంటల ప్రయాణం తర్వాత, అంతరిక్ష నౌక ఐఎస్ఎస్తో విజయవంతంగా డాకింగ్ జరగటం సంతోషకరం. శుభాంశు శుక్లా బృందం 14 రోజులపాటు పరిశోధనలు చేయబోతున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా ఈ మిషన్ను విజయవంతం చేసి ఒక మైలురాయిని అధిగమించాయి.ఈ చారిత్రక విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
Truly a proud moment! Very happy to learn that after a 28-hour journey, the spacecraft successfully docked with the ISS. #ShubhanshuShukla and team are set for 14 days of crucial research. The #Ax4 Mission, a joint effort by NASA and ISRO, marks a significant milestone in space…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025
ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా
ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు