నేను బిక్షగాడిని కాదు సార్‌ .. బూట్‌ పాలిష్‌ చేస్తాను! | Sakshi
Sakshi News home page

మంత్రి కారును ఆపిన కార్మికుడు

Published Tue, Jun 15 2021 11:47 AM

karnataka: Man Stop Minister Car And Requests To Polish His Shoes - Sakshi

బెంగళూరు: లాక్‌డౌన్‌తో కార్మికులు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారో తేటతెల్లం చేసే సంఘటన ఇది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ కారులో వెళ్తుండగా ఓ కార్మికుడు కారు వద్దకు వచ్చి పార్‌ బూట్‌ పాలిష్‌ చేస్తా అంటూ వెట్టర్‌ను ప్రాధేయపడ్డాడు. నగరంలోని కిమ్స్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంత్రి డబ్బులు ఇవ్వపోగా..‘నేను బిక్షగాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్‌’ అని ప్రాధేయపడ్డాడు. చివరకు మంత్రి రూ. 500 నగదు ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు.

చదవండి: ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’

Advertisement

తప్పక చదవండి

Advertisement