JNU: స్టూడెంట్స్ యూనియ‌న్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ.. విద్యార్థులకు గాయాలు

JNU Warns Students After Clash Over Non Vegetarian Food - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జేఎన్‌యూ వ‌ర్సిటీలో ఆదివారం స్టూడెంట్స్ యూనియ‌న్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై సోమవారం జేఎన్‌యూ రిజిస్ట్రార్ విద్యార్థులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. వర్సిటీలో విద్యార్థులు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దంటూ ఓ నోటీసులో హెచ్చరించారు. జేఎన్‌యూ వ‌ర్సిటీలో హింసకు పాల్పడితే సహించేది లేదన్నారు. శాంతికి భంగం క‌లిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వీసీ చెప్పార‌ని ఆ లేఖ‌లో రిజిస్ట్రార్ తెలిపారు.

ఇదిలా ఉండగా..  శ్రీరామ‌న‌వ‌మి పూజ‌ సందర్బంగా వర్సిటీలో ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సంఘాల విద్యార్థుల మ‌ధ్య ఆదివారం ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ ఘర్షణలో దాదాపు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పండుగ సందర్బంగా వర్సిటీ హాస్టల్‌లో నాన్‌ వెజ్‌ వండటం వల్లే ఘర్షణ తలెత్తినట్టు ఓ విద్యార్థి సంఘం నేత పేర్కొనగా.. తామేమీ నాన్ వెజ్ ఫుడ్‌కు వ్య‌తిరేకం కాదు అని, హాస్ట‌ల్‌లో ఏదైనా తిన‌వ‌చ్చు అని మరో విద్యార్థి సంఘం నేత తెలిపారు.

 ఇక, ఘర్షణల నేపథ్యంలో వర్సిటీ క్యాంపస్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వెల్లడించారు. జేఎన్‌యూఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్‌, ఏఐఎస్ఏ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు గుర్తు తెలియ‌ని ఏబీవీపీ విద్యార్తుల‌పై కేసు బుక్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్‌ మనోజ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top