వీడియో: దంచికొట్టిన వర్షం.. వరద నీటిలో బస్సులు, రైల్వే ట్రాక్‌.. | Mumbai And Delhi Ws Hit By Massive Rainfall, Severe Rain Water Logged On Roads Videos Goes Viral | Sakshi
Sakshi News home page

Mumbai Delhi Heavy Rains: దంచికొట్టిన వర్షం.. వరద నీటిలో బస్సులు, రైల్వే ట్రాక్‌..

May 26 2025 11:02 AM | Updated on May 26 2025 1:03 PM

Heavy Rain Leaves Mumbaim And Delhi Waterlogged video Viral

ముంబై: నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నుంచి మహారాష్ట్రలో భారీ కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. వరద నీటి ప్రవాహం కారణంగా కార్లు కొట్టుకుపోయాయి. రైల్వే స్టేషన​్‌లో ప్లాట్‌ఫామ్‌ వరకు వరద నీరు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మహారాష్ట్రలో కుండపోత వర్షం కారణంగా పూణే-సోలాపూర్ హైవే జలమయమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్లో ఇబ్బందులకు గురవుతున్నాయరు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. వరద నీరు కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే ప్రతికూల వాతావరణం కారణంగా పలు విమాన సర్వీసులు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు.

మరోవైపు.. మహారాష్ట్రలోని ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాయ్‌గఢ్, రత్నగిరి, మధుదుర్గ్ జిల్లాల్లో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు నుండి నాలుగు గంటల్లో మహారాష్ట్ర అంతటా కొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులతో కూడిన ఉరుములు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం ఉదయం బారామతిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 3,100 మంది నివాసితులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. 

 

మరోవైపు.. ఢిల్లీ, కర్ణాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 49 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 32 ప్రాంతీయ సర్వీసులు, 17 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇక, కర్ణాటకలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement