పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి | Gunfight Between Police Maoists In Chhattisgarh killed child | Sakshi
Sakshi News home page

పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి

Jan 1 2024 9:36 PM | Updated on Jan 2 2024 6:45 AM

Gunfight Between Police Maoists In Chhattisgarh killed child - Sakshi

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి.

చదవండి: గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్‌! ఇంతకీ నేపథ్యం ఏంటంటే..

Advertisement
 
Advertisement
Advertisement