కరోనా విలయం: ఒక్కరోజే మూడు లక్షల పాజిటివ్ కేసులు

Coronavirus: 314835 New Corona Positive Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,14,835 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2104 మంది కరోనా బాధితులు మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనా నుంచి 1,78,841 మంది బాధితులు కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.  దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,59,30,965 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 1,34,54,880 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 22,91,428 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 13.23 కోట్ల మందికి పైగా కోవిడ్‌ టీకాలు అందించారు.

తెలంగాణలో పెగుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 5,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 23 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 2,251 మంది కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 49,781 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 989 కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: భారత్‌కు మరో సవాల్‌: కరోనా మూడో అవతారం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top