రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల అధికారిగా శంకరాచారి | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల అధికారిగా శంకరాచారి

Sep 18 2025 8:18 AM | Updated on Sep 18 2025 2:38 PM

నారాయణపేట: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్రాంచీ కార్యవర్గ పదవీకాలం ముగియడంతో బుధవారం కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ నారాయణపేట జిల్లా సహకార అధికారి జి. శంకరాచారిని ఎన్నికల అధికారిగా నియమించారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి, ఐఆర్సీఎస్‌ అడహక్‌ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఐఆర్సీఎస్‌ మహాజన సమావేశాన్ని కనీసం 21 రోజుల ముందస్తు నోటీసుతో అక్టోబర్‌ 14, 2025 స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌లో నిర్వహించడానికి నిర్ణయించారు. మహాజన సమావేశం 15 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక, ఆఫీసు బేరర్లు అయిన వారిని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ట్రెజరర్‌, రాష్ట్ర కార్యదర్శి, నామినీల ఎన్నిక రహస్య బ్యాలెట్‌ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఐఆర్సీఎస్‌లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

కోస్గి రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులు తమ పొదుపులను పెంచుకొని ఆర్థికంగా చైతన్యవంతులుగా ఎదగాలని ఆర్‌బీఐ ఎల్‌డీఓ గోమతి, ఎల్‌డీఓ విజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం గుండుమాల్‌ మండల కేంద్రంలో మండల మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఆక్షరాస్యత, కేంద్ర ఫ్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్‌ సేవలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్‌, జీవనోపాధి, సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ రీజినల్‌ మేనేజర్‌ శీల, ఎంపీడీఓ వేణుగోపాల్‌, బ్యాంకు మేనేజర్‌ హరినామశర్శ, సీసీ నర్సిములు తదితరులు ఉన్నారు.

బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం

నారాయణపేట రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ అన్నారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా కమిటీని నియమించారు. 

జిల్లా ఉపాధ్యక్షులుగా కర్ని స్వామి (మక్తల్‌), ఎస్‌.ఉమేష్‌ (ధన్వాడ), కెంచె శ్రీనివాసులు (కోటకొండ), కొండ్రు నర్సింహులు (కొడంగల్‌), మేర్వ రాజు (అమరచింత), పి.చెన్నారెడ్డి (కోయిల్‌కొండ), ప్రధాన కార్యదర్శులుగా జి.బలరాంరెడ్డి (మక్తల్‌), లక్ష్మిగౌడ్‌ (నారాయణపేట), డి.తిరుపతిరెడ్డి (మరికల్‌), కార్యదర్శులు సుజాత (నారాయణపేట), హన్మంతు (మక్తల్‌), విజయభాస్కర్‌రెడ్డి (మద్దూరు), గోపాల్రావు (దామరగిద్ద), రవీంద్ర నాయక్‌ (కొడంగల్‌), కనకరాజు (మాగనుర్‌), కోశాధికారిగా సిద్ధి వెంకట్రాములు (నారాయణపేట), కార్యాలయ కార్యదర్శి సాయిబన్న (భైరంకొండ), సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రమేష్యాదవ్‌ (కొడంగల్‌), మీడియా కన్వీనర్‌ కిరణ్‌ డగే (నారాయణపేట), ఐటీ ఇన్‌చార్జి బి.అనూష (నారాయణపేట)లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, మండల మాజీ అధ్యక్షుడు సాయిబన్న పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం1
1/1

బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement