భూసేకరణ పనులువేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ పనులువేగవంతం చేయాలి

May 25 2025 10:54 AM | Updated on May 25 2025 10:54 AM

భూసేక

భూసేకరణ పనులువేగవంతం చేయాలి

నారాయణపేట: జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో కలిసి నారాయణపేట –కొడంగల్‌ ఎల్‌వన్‌స్కీం, రాజీవ్‌ భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్‌ భూ సేకరణ పనులను ఇరిగేషన్‌, రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 21 గ్రామాల్లో భూసేకరణ జరగగా మక్తల్‌లో 155.38 ఎకరాలు, ఊట్కూర్‌లో 234.16 ఎకరాలు, నారాయణపేటలో 94.33 ఎకరాలు, దామరగిద్దలో 76.35 ఎకరాలు పురోగతిలో ఉందన్నారు. ఎల్‌ఏ ప్రతిపాదన కానుకుర్తి ట్యాంక్‌ (749 ఎకరాలు) ఒక లక్ష ఎకరాల గ్రావిట్‌ కెనల్స్‌ కానుకుర్తి, దౌల్తాబాద్‌ పనులలో ప్రాసెస్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ 1500 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, సీఈ రమణారెడ్డి, ఎస్‌ఈ హెచ్‌టి శ్రీధర్‌, ఈఈ బ్రహ్మం, ఈఈ ప్రతాప్‌ సింగ్‌, ఆర్డీఓ రాంచందర్‌ నాయక్‌, తహశీల్ధార్‌లు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

నారాయణపేట: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే సీసీ టీఎన్‌ఎస్‌ పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌ అప్లికేషన్‌లో నమోదుచేయాలని, ఫిర్యాదుదారులకు రషీదు, ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలని డీసీఆర్‌బీ ఎస్‌ఐ సునీత తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయా పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించే రిసెప్షనిస్టులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం కోసం వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా ఉండాలని, వారి సమస్యను విని.. న్యాయం జరుగుతుందని నమ్మకం, భరోసా కల్పించాలని తెలిపారు. ఫిర్యాదుదారులను వాటి తీవ్రతను బట్టి పైఅధికారులకు సమాచారం అందించి తగిన న్యాయం చేయాలన్నారు. ఫిర్యాదు పెండింగ్‌లో ఉంటే కారణాలను ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఐటీకోర్‌ టీం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదుచేసే విధానం, ఆన్‌లైన్‌లో తప్పులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. శ్రీనివాసులు, శ్రీజ, మహేశ్‌ పాల్గొన్నారు.

భూసేకరణ పనులువేగవంతం చేయాలి 
1
1/1

భూసేకరణ పనులువేగవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement