
భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి
మద్దూరు: భూ భారతి పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాకాస్తుల పరిశీలనపై ఆర్డీఓ రాంచందర్నాయక్, భూభారతి ప్రత్యేకాధికారి యాదగిరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరునాటికి వంద శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.