
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని గురువారం స్వాతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆండాల్ ఆమ్మవారి దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో ముగించారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

వైభవోపేతం.. స్వాతి మహోత్సవం