ప్రతిభకు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పురస్కారాలు

Sep 3 2025 4:49 AM | Updated on Sep 3 2025 4:49 AM

ప్రతిభకు పురస్కారాలు

ప్రతిభకు పురస్కారాలు

నంద్యాల: చిన్నటేకూరు అంబేడ్కర్‌ అకాడమీలో చదివి ఎంబీబీఎస్‌ సీట్లు సాధించిన ఇద్దరు జిల్లా విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గనియా రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం, మెమోంటో అందజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన నికేష్‌నాయక్‌, కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన ప్రణయ్‌లు చిన్నటేకూరు అంబేడ్కర్‌ అకాడమీలో చదువుకొని ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం అభినందించదగ్గ విషయమన్నారు. గ్రామీణ విద్యార్థులు మరింతగా రాణించేందుకు ఈ విజయాలు ప్రేరణ ఇస్తాయన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీదేవి, చిన్నటేకూరు అకాడమీ ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, అకాడమీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరప్ప, మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement