ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు | - | Sakshi
Sakshi News home page

ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు

Apr 29 2025 9:36 AM | Updated on Apr 30 2025 1:46 AM

ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు

ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు

సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి

అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తయింది. 2024 జనవరి 5 నుంచి 16వ తేదీ వరకు డ్రోన్‌ రిమోట్‌ పైలెట్‌గా శిక్షణ తీసుకున్నా. ఇలాగైనా ఉపాధి లభిస్తుందని ఆశపడ్డా. ప్రభుత్వం మారడంతో మమ్మల్ని పక్కనపెట్టేశారు. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి. నిరుద్యోగుల విషయంలోనూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం. – ముత్యాలరాజు, వెల్దుర్తి గ్రామం

కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన యువకుడు అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేశాడు. వ్యవసాయం పట్ల అతనికున్న ఆసక్తిని గమనించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డ్రోన్‌ పైలెట్‌గా ఎంపిక చేశారు. రైతులకు సేవ చేసేందుకు అవకాశం కలిసి వచ్చిందని అతను ఎంతో సంతోషించాడు. ఆచార్యా ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 12 రోజులు రిమోట్‌ పైలెట్‌ శిక్షణ కూడా తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు ‘తమ్ముళ్ల’ కోసం ఇతడిని పక్కన పెట్టేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement