జిల్లాలో మోస్తరు వర్షం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో మోస్తరు వర్షం

May 31 2025 1:12 AM | Updated on May 31 2025 1:12 AM

జిల్లాలో మోస్తరు వర్షం

జిల్లాలో మోస్తరు వర్షం

నంద్యాల(అర్బన్‌): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో అత్యధికంగా 29.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా వెలుగోడు మండలం 0.4 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా ప్యాపిలిలో 23.2, కొలిమిగుండ్ల 12.6, కోవెలకుంట్ల 12.2, రుద్రవరం 12.0, బనగానపల్లె 9.6, సంజా మల 9.2, డోన్‌ 8.0, శిరివెళ్ల 7.2, ఆళ్లగడ్డ 7.0, గోస్పాడు 6.4, అవుకు 5.2, దొర్నిపాడు 4.8, చాగలమర్రి 2.0 మి.మీ వర్షం కురిసింది.

నేటి నుంచి పింఛన్ల పంపిణీ

నంద్యాల(న్యూటౌన్‌): ఎన్‌టీఆర్‌ సామాజిక భద్రతా పింఛన్లు ఈనెల 31 నుంచి పంపిణీ చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 1వ తేదీ ఆదివారం కావడంతో పింఛన్లు ఒక్కరోజు ముందే శనివారం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెలకు సంబంధించి జిల్లాలో 2,13,377 మందికి రూ.91.96 కోట్లు మంజూరు చేశారన్నారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పింఛన్‌దారుల ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది చేరుకోని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు పింఛన్ల పంపిణీపై పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ గడువు పొడిగింపు

నంద్యాల(న్యూటౌన్‌): వర్కింగ్‌ జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కలెక్టర్‌, జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌ రాజకుమారి శుక్రవారం తెలిపారు. గతంలో రెన్యువల్‌ చేసిన అక్రిడిడేషన్‌ కాల పరిమితి మే 31వ తేదీ నాటికి ముగుస్తున్న నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారన్నారు.

తుంగభద్రకు వరద

కర్నూలు సిటీ: తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 4,504 క్యుసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 1.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 4,345 క్యుసెక్కుల నీరు ఒక గేటు మీటర్‌ పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 159 క్యూసెక్కులు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు.

సబ్సిడీ విత్తన ధరలు ఖరారు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌లో పంపిణీ చేసే విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీలను ఖరారు చేసింది. జిల్లాకు వేరుశనగతో పాటు 892 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల మినుములు, 10 క్వింటాళ్ల పెసర, 70 క్వింటాళ్ల కొర్ర, 154 క్వింటాళ్ల దయంచా, 11 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను కేటాయించింది. విత్తనాల పంపిణీ జూన్‌ రెండవ వారం నుంచి చేపట్టే అవకాశం ఉంది.

● మినుము కిలో పూర్తి ధర రూ.138 ఉండగా.. సబ్సిడీ రూ.41.40.

● పెసర కిలో పూర్తి ధర 135 ఉండగా.. సబ్సిడీ రూ.40.50.

● కందులు కిలో పూర్తి ధర రూ.109.50 కాగా.. సబ్సిడీ రూ.32.85.

● కొర్ర కిలో పూర్తి ధర రూ.60 ఉండగా.. సబ్సిడీ రూ.30.

● వేరుశనగ కిలో పూర్తి ధర రూ.93 కాగా.. సబ్సిడీ రూ.37.20.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement