
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు నిర్వహించిన పంచాంగ శ
వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు ఎలా కొనసాగిస్తాం. లేని పిల్లవానికి ఏమి పేరు పెట్టమన్నట్లుంది.
– శాసనమండలిలో మంత్రి డోలా
వీరాంజనేయ స్వామి
కోవెలకుంట్ల/ఆళ్లగడ్డ/నంద్యాల అర్బన్: ప్రతి ఇంటికి నవరత్నాలు చేర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచింది. అందులో భాగంగానే ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా నిలిచేలా నియమించిన వలంటీర్ల సేవలు గడప గడపను తాకాయి. ఈ సేవా బలగం కూటమి మోసానికి బలైంది. చివరకు ప్రజలకు దూరమై.. ఉపాధి కోల్పోయారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 10,508 మంది వలంటీర్లు దాదాపు ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కీలకపాత్ర పోషించారు. అయితే గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని నెలకు వారికి రూ. 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని కూటమి నేతలు హామీలు గుప్పించి మోసం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వలంటీర్ వ్యసవ్థను పట్టించుకున్న పాపాన పోలేదు. వలంటీర్లు లేకపోవడంతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అందించిన సేవలను వలంటీర్లు, ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. కూటమి సర్కార్ వలంటీర్ వ్యవస్థను దగా చేయడంపై తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు.
వలంటీర్లు లేక ఏడాది కాలంగా పడుతున్న అవస్థలు, సమస్యలను చెప్పుకొచ్చారు. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల తలుపు తట్టి ఠంచన్గా పింఛన్లు పంపిణీ చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేవకముందే వారి ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులను యోగక్షేమాలను పలకరించి మరీ అందజేశారు. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన 32 సంక్షేమ పథకాలను అందించడంలో వలంటీర్లు ఎనలేని సేవలందించారు. తమకు కేటాయించిన 50 ఇళ్లలో ఆయా పథకాలకు అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి అందుకు అవసరమైన ధ్రువపత్రాలను సేకరించి గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయించారు. కుల, పథకాల మంజూరులో ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు.
కరోనాలో ప్రాణాలను లెక్కచేయకుండా
2020 మార్చి నెల నుంచి రెండేళ్లపాటు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కాలంలో సైతం వలంటీర్లు ప్రాణాలకు తెగించి ఆయా కుటుంబాలకు అండగా నిలిచారు. వారికి కేటాయించిన కుటుంబాల్లోని వ్యక్తులు వైరస్బారిన పడితే కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రాని పరిస్థితి ఉండేది. ఆ సమయంలో వలంటీర్లు రోగికి వైద్య సేవలందించేందుకు ఎంతగానో కృషి చేశారు. రోగులకు మందులు అందించడం, ఫీవర్ సర్వే, వైద్యుల సలహాలు, సూచనలు అందజేసి కరోనా వారియర్స్గా నిలిచారు.
నియోజకవర్గాల వారీగా
పనిచేసిన వలంటీర్లు
నియోజకవర్గం మొత్తం వలంటీర్లు
బనగానపల్లె 1,564
ఆళ్లగడ్డ 1,495
నంద్యాల 1,542
నందికొట్కూరు 1,376
డోన్ 1,435
శ్రీశైలం 1,241
పాణ్యం, 1,855
గడివేముల
మొత్తం 10,508
కూటమి సర్కార్ దగా
వలంటీర్ల సేవలను గుర్తించిన కూటమి నేతలు గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను పావుగా వాడుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు రూ. 10 వేలు వేతనం అందజేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థను పట్టించుకోకుండా తుంగలో తొక్కింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ఎన్నిమార్లు ఆందోళన కార్యక్రమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రూ. 10 వేలు వేతనం అందుతుందని ఆశపడిన వలంటీర్లకు నిరాశే మిగిలింది. వ్యవస్థను కొనసాగించకుండా నిర్వీర్యం చేయడంతో వలంటీర్లు జీవనానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. వ్యవసాయ, ఉపాధి కూలీలుగా, వివిధ వ్యాపార సంస్థల్లో గుమాస్తాలుగా పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గౌరవ వేతనంతోపాటు నవరత్న పథకాల్లో పలు సంక్షేమ పథకాలు వలంటీర్ల కుటుంబాలకు వర్తించేవి. ఈ పథకాల ద్వారా వచ్చే డబ్బులతో వలంటీర్ల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిచేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలంటీర్లుగా కొనసాగించకపోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ఆ కుటుంబాట్లో చీకట్లు అలుముకున్నాయి.

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు నిర్వహించిన పంచాంగ శ