
రాష్ట్రంలో అరాచక పాలన
డోన్: రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషం, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై న వ్యక్తులతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం లేకపోతే అభివృద్ధి ఫలాలు అందవన్నారు. డోన్ నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు కేవలం 10 శాతం మాత్రమే మిగిలివుంటే టీడీపీ కూటమి నాయకులు వాటిని పూర్తిచేయకుండా ఆ ఫలాలను ప్రజలకు దూరం చేయడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. డోన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
అభివృద్ధి పనులు ఎందుకు నిలిపారు?
‘నియోజకవర్గంలో రూ.3వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులలో సింహభాగం పూర్తిచేసి ప్రజలకు సకాలంలో అందించిన సంతృప్తి మాకు కలిగింది. మిగిలిన 10 శాతం పనులను కూటమి నేతలు పూర్తిచేయకపోవడం విచారకరం. యువత ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీడీఆర్ నిర్మాణ పనులు ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. గుండాల, మద్దిలేటిస్వామి, ముచ్చట్ల, కంబగిరి స్వామి ఆలయాల పునరుద్ధరణ పనులకు ఎందుకు అడ్డు తగులుతున్నారో అర్థంకావడం లేదు. డోన్లో ఏడు పార్కులు నిర్మిస్తే వాటి ఆలనాపాలనా పట్టించుకోకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారు. రూ.5 కోట్లతో నిర్మించిన క్లబ్ హౌస్ను పేకాట క్లబ్గా మార్చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని సిద్ధంచేస్తే ఇప్పటివరకు తరగతులు ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే, సుమారు రూ.300 కోట్లతో గోరకల్లు రిజర్వాయర్ నుంచి శుద్ధజలాల్ని నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు 77 ఓవర్హెడ్ ట్యాంకులతో పాటు పైపులైన్లను పూర్తిచేసినా టీడీపీ నేతలు ఇప్పటివరకు ప్రారంభించలేదు.
అక్కసుతోనే బ్రేక్
ఇక రూ.40 కోట్లతో నిర్మించిన ప్రభుత్వాసుపత్రిలో కూటమి ప్రభుత్వం ఫర్నిచర్ కూడా ఏర్పాటుచేయలే ని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికల కోసం సొంత హాస్టల్ భవనాలను నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిస్తే నేటి ప్రభుత్వం వాటిని రద్దుచేయడం దురదృష్టకరం. కోట్లాది రూపాయలతో నిర్మించిన సబ్రిజిస్ట్రార్, టీటీడీ కళ్యాణ మండపాలు, క్లబ్ హౌస్ లాంటివన్నీ నిరుపయోగంగా మార్చారు.
టీడీపీ కూటమి నేతలు అభివృద్ధి పనులను పూర్తిచేయడంలేదు
‘గోరుకల్లు’ పరిధిలో 77 ట్యాంకులు
పూర్తయినా ఇప్పటివరకు
ప్రారంభించలేదు
మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
మండిపాటు