ఎంపీడీఓల క్షేత్రస్థాయి సందర్శన
రామగిరి(నల్లగొండ): ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా శుక్రవారం నల్లగొండ మండలం దండెంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఇందిరమమ్మ ఇళ్లు, సిమెంట్ రోడ్లు, నర్సరీ, ఐకేపీ సెంటర్, డంపింగ్ యార్డులను పరిశీలించారు. వీరికి గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఎంపీడీఓ యాకుబ్నాయక్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు జె.మహేష్, హిమబిందు, స్వర్ణలత, వేద రక్షిత, వంశీధర్ ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.


