ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి క్షేత్రంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్దేవికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం వేళ అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పర్వాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం, ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం ప్రాకార మండపంలో సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు.


