
‘స్థానిక’ స్థానాలు ఖరారు
జిల్లాలో 33 చొప్పున జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 353 ఎంపీటీసీలు
ఆర్డినెన్స్పై ఉత్కంఠ!
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అర్డినెన్స్ బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ ఆమోదిస్తారా.. లేక తిప్పిపంపుతారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ గవర్నర్ ఆమోదిస్తే దాని ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు కానున్నట్టు తెలుస్తోంది.
నల్లగొండ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా స్థానాలను ఖరారు చేసి జాబితాలను వెల్లడించింది. దీంతోపాటు స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు సైతం అందాయి.
పెరిగిన నాలుగు ఎంపీటీసీ స్థానాలు
జిల్లాలో 2019లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 31 చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు మండలాలు పెరిగాయి. దీంతో ఎంపీపీ, జెడ్పీ స్థానాల సంఖ్య 33కు చేరింది. ఇక గతంలో 349 ఎంపీటీసీ స్థానాలుండగా ఎంపీటీసీ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 4 స్థానాలు పెరిగాయి. ఆ ఎంపీసీటీల సంఖ్య 353క చేరింది. పెరిగిన స్థానాలన్నింటిని జిల్లా అధికారులు జాబితాను ప్రభుత్వానికి పంపడంతో ప్రభుత్వం వాటిని నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
యంత్రాంగానికి ఆదేశాలు..
స్థానిక సంస్థల స్థానాలు ఖరారు కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల సమరభేరీ మోగనుంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అఽధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు కావాల్సిన మెటీరియల్, అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో, డీపీవోలు, పోలీస్శాఖకు ఆదేశాలు అందాయి.
ఫ కొత్తగా పెరిగిన 4 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు
ఫ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఫ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు