
నా రాజీనామా ప్రచారం అబద్ధం
నల్లగొండ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తనకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని, అయితే తనకు ఆ పదవి తగదని సీనియర్లకు అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యఽక్షుడిని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు గతంలో ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని, అందుకే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. అవకాశం ఉంటే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడిని, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలను కోరినట్లు చెప్పారు. అవకాశం లేకపోతే కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. కోమటిరెడ్డికి దూరం అవుతున్నానంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అఽధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకొని ఉంటానని, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. గత పది సంవత్సరాలు పార్టీ అధికారంలో లేకపోయినా, ఎవరు ఉన్నా, లేకున్నా తాను కార్యకర్తల వెంట ఉన్నానన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గుమ్మల మోహన్రెడ్డిది న్యాయబద్ధమైన కోరిక అని అన్నారు. ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదని, ఈ విషయంలో గతంలో కూడా హామీ ఇచ్చారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నాయకులు కత్తుల కోటి, జూలకంటి వెంకట్రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పోలె జయకుమార్, జహంగీర్ పాల్గొన్నారు.
ఫ అవకాశం ఉంటే అధ్యక్ష పదవి ఇవ్వాలని అడిగా
ఫ పదవి లేకపోయినా కార్యకర్తగా ఉంటా
ఫ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు మోహన్రెడ్డి